బలి పీఠంపై బాలిక..! | Sakshi
Sakshi News home page

బలి పీఠంపై బాలిక..!

Published Fri, Nov 3 2017 5:10 PM

Man Rape attempt the  Young girl in chittoor district - Sakshi

సాక్షి, గంగవరం: బుద్ధి మాధ్యం బాలిక(19)పై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలంలోని దండపల్లె గ్రామంలో వెలుగు చూసింది. బాధితురాలు తల్లి సుశీలమ్మ, తండ్రి చంద్రప్పల కథనం మేరకు వివరాలు.. గురువారం సాయంత్రం గ్రామానికి చెందిన సుబ్రమణ​‍్యం(50) అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడాడు. గ్రామ సమీపంలో ఉన్న జొన్న తోటలోకి వెళ్ళిన బుద్ధి మాద్యం గల బాలికపై అతను అత్యచారానికి యత్నించాడు.

ఆ బాలిక ఏమి చేయాలో పాలుపోక కేకలు వేసింది. దీంతో నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. బాలిక కేకలతో ఇరుగు పొరుగువారు అక్కడికి చేరుకుని సమాచారాన్ని అమ్మాయి తల్లిదండ్రులకు అందించారు. అక్కడికి వచ్చిన తల్లిని చూసి బాలిక జరిగిన సంఘటన చెప్పలేని అమాయకురాలు. కూతురును చూసిన తల్లి మనుసు పాతాళంలోకి కూరుకుపోయింది.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు కొంతమేర రాజీ ప్రయత్నాలు చేశారు. ఇంతలో బాధితురాలు తల్లిదండ్రులు శుక్రవారం చిత్తూరులోని ‘సఖి ఓన్‌ స్టాప​ కేంద్రా’నికి ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం అందించారు. ఐసీడీఎస్‌ అధికారిణి రాజేశ్వరీ, ఓన్‌స్టాఫ్‌ అధికారిణి సుజాతలు పలమనేరు డీఎస్పీ చౌడేశ్వరికి ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆదేశాల మేరకు గంగవరం సీఐ మధుసూదన్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement
Advertisement